Share News

Kesineni Sivanath: ధైర్యం లేని జగన్‌ తొత్తులంటూ.. ఓ రేంజ్‌లో ఎంపీ శివనాథ్ మాస్ వార్నింగ్

ABN , Publish Date - May 13 , 2025 | 11:03 AM

Kesineni Sivanath: మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను ఎదుర్కొనే దమ్ము నానికి లేదని విమర్శించారు. తన జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

 Kesineni Sivanath: ధైర్యం లేని జగన్‌ తొత్తులంటూ.. ఓ రేంజ్‌లో ఎంపీ శివనాథ్ మాస్ వార్నింగ్
Kesineni Sivanath

అమరావతి: మాజీ ఎంపీ కేశినేని నానికి (Kesineni Nani) విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Sivanath) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ(మంగళవారం) ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో మీడియాతో కేశినేని శివనాథ్ మాట్లాడారు. తాను ధైర్యంగా మీడియా ముందుకు వస్తున్నానని తెలిపారు. ధైర్యం లేని జగన్ తొత్తులందరూ మీడియా ముందుకు రాకుండా ఫేస్‌బుక్‌లోకి వస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు.


ఒక్కసారైనా మీడియా ముందుకు కేశినేని నాని వచ్చారా అని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నించారు. తాము, చంద్రబాబు నాయుడు సైనికులం నిజం నిర్భయంగా చెప్పగలమని ఉద్ఘాటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోమోహన్ రెడ్డి కక్కుర్తి సొమ్ముకు అలవాటు పడిన వ్యక్తులం కాదని హెచ్చరించారు. జగన్ తొత్తులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.


కేశినేని నాని త్వరలో జైలుకు వెళ్తారు: నాగుల్ మీరా

కేశినేని హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్‌పై అప్పు తెచ్చిన మాజీ ఎంపీ కేశినేని నాని బ్యాంకుకు లోన్ ఎగ్గొట్టారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా (Nagul Meera) ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) టీడీపీ కార్యాలయంలో నాగుల్ మీరా మాట్లాడారు. కేశినేని నాని త్వరలో జైలుకు వెళ్తారని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేశినేని నాని ఇద్దరు ఒకే సెల్‌లో ఉంటారని విమర్శించారు. బ్యాంకులకు డబ్బులు ఎగొట్టి, వాటిని షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారని నాగుల్ మీరా ఆరోపణలు చేశారు.


హోటల్ డైరెక్టర్లను మార్చేసి, కూతుళ్ల పేరుతో కేశినేని నాని ఆంధ్ర రెస్టారెంట్‌ను అదే హోటల్లో నడుపుతున్నారని నాగుల్ మీరా ఆరోపించారు. ఆయన ఆర్ధిక నేరాలపై సీబీఐ, ఈడీలతో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసూయ, ఆక్రోశంతో కేశినేని నాని తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేశినేని నాని అహంకారంతో తల్లి, చెల్లి, స్నేహితులందరినీ దూరం చేసుకుని ఒంటరయ్యాడని నాగుల్‌మీరా విమర్శలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం

Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు

Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..

Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి

Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 11:10 AM