Buddha Venkanna: కేశినేని నానిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:58 AM
Buddha Venkanna: మాజీ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రావెల్స్ పేరుతో కార్మికులను మోసం చేశావని బుద్దా వెంకన్న ఆరోపించారు.

అమరావతి: మాజీ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయ్యా కేశినేని నాని.. నీకు ఎంపీ సీటు ఇవ్వలేదని ముందు నుంచి నీ తమ్ముడిపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉన్నావ్. నాడు నీ సొంత తమ్ముడి భార్యపైన కేసు పెట్టావ్. నేడు సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నావా. కేశినేని శివనాథ్ ఇంజనీరింగ్ క్లాస్మెట్ కంపెనీకి ల్యాండ్ ఇవ్వకూడదని అడ్డుపడుతున్నావ్’ అని బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోర్డు తిప్పేశావ్..
‘బ్యాంకులకు రుణాలు కట్టాల్సి వస్తోందని కార్మికులకు జీతాలు చెల్లించాల్సి వస్తుందని ట్రావెల్స్ బోర్డు తిప్పేసి, కొన్ని "వేల కోట్లకు పంగనామం" పెట్టిన నువ్వా ఇలాంటి నీతులు చెబుతుంది. ఎవరెవరికి ఏం చేయాలో, ఏ పరిశ్రమలను ఏపీకి ఎలా తీసుకురావాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి బాగా తెలుసు. మధ్యలో నీ ఉపన్యాసాలు వినే తీరిక, నీతో చెప్పించుకునేంత ఖర్మ చంద్రబాబుకి లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కన చేరావ్ అని ప్రజలు నిన్ను చీ కొట్టారు.. మర్చిపోయావా. రాజకీయాల నుంచి దురమైపోతున్నానని చెప్పి నేడు మళ్లీ ఏం ఆశించి ఇలాంటి ట్వీట్లు పెడుతున్నావ్’ అని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్
AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ
High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి
For More Andhra Pradesh News and Telugu News..