Tangirala Soumya: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విన్నూత ఆలోచన
ABN , Publish Date - May 06 , 2025 | 10:58 AM
Tangirala Soumya: పదోతరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు విమాన ప్రయాణాన్ని ప్రభుత్వ విప్, నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కల్పించనున్నారు. ఎమ్మెల్యే నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా: ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (MLA Tangirala Soumya) విన్నూత ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ప్రకటించిన పదోతరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల కలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నెరవేర్చనున్నారు. నందిగామకు చెందిన ఆరుగురు విద్యార్థులను గన్నవరం నుంచి హైదరాబాద్కు ఇవాళ(మంగళవారం) విమాన ప్రయాణం చేయించనున్నారు. తంగిరాల సౌమ్య ఈ నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కంచికచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కె. వెంకట నాగశ్రీనాయి(587), ముప్పాళ్ల గురుకుల బాలికల పాఠశాల విద్యార్థి చిగురుపాటి యశస్విని(583), తోటరావులపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పెసరమల్లి అనూష(577), అల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి గూడేరు గణేష్రెడ్డి(573), వెల్లంకి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సిరివేరు నవ్వ(570) పది ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యుత్తమ మార్కులు వచ్చిన విద్యార్థులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ సమయంలోనే పేద విద్యార్థుల కలను తంగిరాల సౌమ్య నెరవేర్చనున్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు విమానంలో విద్యార్థులతో తంగిరాల సౌమ్య ప్రయాణించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Deputy CM Pawan: బంగాళాఖాతంలో ఘర్షణలు
CM Chandrababu: అన్ని సేవలూ వాట్సాప్లోనే
Minister Gottipati Ravi Kumar: విద్యుత్ ఒప్పందాలపై అసత్య ప్రచారం
For More AP News and Telugu News