Share News

Vadde Shobha Nadreeswara Rao: జర్నలిస్టు కృష్ణంరాజుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jun 09 , 2025 | 08:22 AM

రాజధాని రైతుల మనోభావాలను దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి మీడియా వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. కృష్ణంరాజుపై వెంటనే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వడ్డే శోభనాద్రీశ్వర రావు ప్రభుత్వాన్ని కోరారు.

Vadde Shobha Nadreeswara Rao: జర్నలిస్టు కృష్ణంరాజుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
Vadde Shobha Nadreeswara Rao

అమరావతి: రాజధాని అమరావతి మహిళల మనోభావాలను తీవ్రంగా గాయపర్చేలా సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు (Krishna Raju) అత్యంత అభ్యంతరకరమైన, సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు (Vadde Shobha Nadreeswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు బేషరతుగా రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


రాజధాని రైతుల మనోభావాలను దెబ్బతినేలా జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి మీడియా వ్యవహారించడం సరికాదని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఇవాళ(సోమవారం)అమరావతిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కృష్ణంరాజుపై వెంటనే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో సాక్షి యాజమాన్యం, జగన్, భారతి నైతిక బాధ్యత వహించాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.


జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్‌రావులపై కేసు నమోదు

కాగా, మరోవైపు.. రాజధాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి చానల్ మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాస్‌రావు , ఆ చానల్ యాజమాన్యంపై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న(ఆదివారం) రాజధాని మహిళలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.


ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్‌రావులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రెండు రోజుల నుంచి విజయవాడలో ఇంటికి తాళం వేసి కుటంబంతో సహా కృష్ణంరాజు పరారయ్యాడు. కొమ్మినేని కోసం హైదరాబాద్‌కి విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ప్రత్యేక పోలీస్ బృందాలు వెళ్లాయి.


ఇవి కూడా చదవండి:

ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే..

హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన

For More AP News and Telugu News

Updated Date - Jun 09 , 2025 | 08:31 AM