Pawan Kalyan: నా సినిమాను బాయ్కాట్ చేస్తానంటే.. ఎవరికీ బెదిరేది లేదు: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jul 24 , 2025 | 09:10 PM
మన చిన్నప్పటి నుంచి చదివిన కథలు వేరు.. జరిగింది వేరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. జిజియా పన్ను గురించి తాను చిన్నప్పుడు చదువుకున్న విషయం ఈ సినిమా చేసేటప్పుడు గుర్తు వచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన హరి హర వీర మల్లు సినిమా (Hari Hara Veera Mallu movie) ఇవాళ(గురువారం జులై24) విడుదల అయింది. ఈ మూవీ సక్సెస్ మీట్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. సక్సెస్ మీట్లు తనకు అలవాటు లేదని చెప్పుకొచ్చారు. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో తన పంచాయతీ శాఖ గురించి మాట్లాడతానని అనుకున్నానని... కానీ సినిమా సమస్యలు కూడా తాను పరిష్కరిస్తానని అనుకోలేదని తెలిపారు. తన జీవితంలో ఏది అంత ఈజీగా లభించలేదని వెల్లడించారు. గత రెండు రోజులుగా ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నానని.. తనకు సరైన నిద్రలేదని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
భగవంతుడు తనకు నీ సినిమాను ప్రమోట్ చేసుకోమని అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. సినిమా జయాపజయాలను తాను తలకు ఎక్కించుకోనని తెలిపారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్లో గ్లిజ్డెస్ ఉండొచ్చు.. కానీ ఇది ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అయిందనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు. మన చిన్నప్పటి నుంచి చదివిన కథలు వేరు.. జరిగింది వేరని వెల్లడించారు.. జిజియా పన్ను గురించి తాను చిన్నప్పుడు చదువుకున్న విషయం ఈ సినిమా చేసేటప్పుడు గుర్తువచ్చిందని అన్నారు. ఈ సినిమాను రెండు పార్ట్స్గా చేయాలనుకున్నప్పుడు.. చరిత్రలో జరిగిన నాటి సంఘటనలను చూపాలనుకున్నామని తెలిపారు. చరిత్రలో అక్బర్ ది గ్రేట్ అంటాం కానీ.. కృష్ణదేవరాయులు జై, రాణీ రుద్రమదేవికి జై అనమని చెప్పుకొచ్చారు. ఇంతా చేసి మొగులులు పరిపాలించింది రెండువందళ్ల ఏళ్లేనని.. చరిత్ర అలా రాసేశారని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
సెన్సిటివ్ మ్యాటర్లా చూస్తారు..
‘ఔరంగజేబు గురించి మాట్లాడితే సెన్సిటివ్ మ్యాటర్లా చూస్తారు... కానీ ఆయన ఎంతోమందిని చంపాడు..ఇబ్బంది పెట్టాడు. అందుకే ఔరంగజేబు డార్కర్ సైడ్ను చూపించాలని ఈ కథలో ఎక్స్ ప్యాండ్ చేశాం. ఔరంగజేబు దుర్మార్గం కూడా చెప్పాలని క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్లో వివరంగా చూపాం. ఇదంతా గుడ్ వర్సెస్ బ్యాడ్ మాత్రమే కానీ.. కమ్యూనల్ డిఫరెన్స్లకు సంబంధించింది కాదు. ఈ చిత్రం పార్ట్ -2 కూడా 20 నుంచి 30 శాతం పూర్తి చేశాం.. ఇక ఈ మూవీ నిర్మాత రత్నంకి అండంగా మైత్రీ రవి, నవీన్ , పీపుల్ మీడియా విశ్వప్రసాద్ నిలిచారు.. వారికి ధన్యవాదాలు. ఈ సినిమాను కొంతమంది బాయ్కాట్ చేస్తాం అంటున్నారు.. ఎస్ చేయండి.. నేను పెద్దస్థాయికి ఎదిగాను.. మిమల్ని భయపట్టే స్థాయికి ఎదిగాను అనుకుంటాను. నా అభిమానుల బలం వల్లే ఇదంతా. మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే మనం బలంగా ఉన్నామని మా టీమ్కు చెప్పాను. మొగలులు చేసిన మంచే కాదు.. చెడు గురించి మాట్లాడాలి. కేవలం పాజిటివ్ సైడ్నే నూరిపోశారు’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇది బిగ్గెస్ట్ ఎఛీవ్మెంట్..
‘నేను హరి హర వీర మల్లు సినిమాలో అన్నింటిని అడ్రెస్ చేయటం బిగ్గెస్ట్ ఎఛీవ్మెంట్. నేను కలెక్షన్స్ దగ్గర ఆగిపోను. సినిమా అనేది ఇంపాక్ట్ .. ఎలా అది మనతో కనెక్ట్ అవుతుందనేది ఇంపార్టెంట్. హరిహర వీరమల్లు అది రీచ్ అయింది. ఈ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. హరి హర వీర మల్లు పార్ట్- 2 విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. అభిమానులు సెన్సిటివ్గా ఉండకండి.. హ్యాపీగా మీ జీవితాన్ని ఆస్వాదించండి. ఈ సినిమా నాదో రత్నందో మాత్రమే కాదు.. ఇది మన దేశ చరిత్రకు సంబంధించింది. కోహినూర్ పగిలినా పర్లేదు.. మన దేశ సాంస్కృతిక సంపద వారసత్వం కొనసాగటం అవసరం. ఇలాంటి ఒక సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. నేను 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఎంత అవమానపడతానో అని అనుకున్నారు.. కానీ నేను చిన్నస్థాయి నుంచి హీరోగా ఎదిగి ఈ స్థాయికి రావటమే గొప్ప విజయం. నేను జీవితాన్ని కాదు మానవత్వాన్ని, బంధాలను సీరియస్గా తీసుకుంటాను.. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలి’ అని పవన్ కల్యాణ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి నారా లోకేష్ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News