AP News: సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు.. అధికారులు అలర్ట్
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:48 PM
ఏపీ సీఎం చంద్రబాబు వినియోగించే హెలీకాప్టర్లో తరచుగా సమస్యలు వస్తున్నాయి. ఇవాళ మరోసారి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్కి ఈ హెలీకాప్టర్ని ఏపీ పర్యటన నిమిత్తం కేటాయించారు. కేంద్రమంత్రి కృష్ణపట్నం పోర్టుకి వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కిన సమయంలో మొరాయించడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) జిల్లాల పర్యటనలకు తరుచుగా వినియోగించే హెలికాప్టర్లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇవాళ (సోమవారం) ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనకు అదే హెలీకాప్టర్ని అధికారులు కేటాయించారు. ఈ హెలీకాప్టర్లో తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు కేంద్రమంత్రి వెళ్లేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.
పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం రావడంతో కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్లో టెక్నికల్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్పై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఈ హెలికాప్టర్ని వినియోగించవచ్చా.. లేదా? అనే అంశంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ కోరారు.
విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటన..
కాగా, విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు ఇవాళ(సోమవారం) పర్యటించారు. బీచ్ రోడ్లో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లని పరిశీలించారు. బీచ్ రోడ్ నుంచి రుషికొండ వరకూ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్, ఐపీఎస్ అధికారులు ఆయా వివరాలను సీఎంకు వివరించారు. అనంతరం ఆంధ్ర యూనివర్శిటీలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
షార్లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest AP News And Telugu News