Home » Piyush Goyal
ఏపీ సీఎం చంద్రబాబు వినియోగించే హెలీకాఫ్టర్లో తరచూగా సమస్యలు వస్తున్నాయి. ఇవాళ మరోసారి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్కి ఈ హెలీకాఫ్టర్ని ఏపీ పర్యటన నిమిత్తం కేటాయించారు. కేంద్రమంత్రి కృష్ణపట్నం పోర్టుకి వెళ్లడానికి హెలీకాఫ్టర్ని ఎక్కిన సమయంలో మొరాయించడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
రాష్ట్రంలో అనుమతించిన విస్తీర్ణంలోనే పొగాకు సాగు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. చాలా చోట్ల అదనంగా పొగాకు సాగు చేస్తుండటం వల్ల సమస్యలు...
గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి భరత్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పొగాకు బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో తమ వ్యాపార సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి. అందుకు సంబంధించిన చర్చల (India US Trade Talks) గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
CAIT Letter To Piyush Goyal: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ లేఖ రాసింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫారాలపై పాకిస్థాన్ జెండాలు, లోగోలు ఉన్న వస్తువులు విక్రయమవుతున్నట్టు సమాచారం ఉందని పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సీ ఫుడ్ ఎగుమతి అయ్యిందని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నట్లు చెప్పారు. కానీ, ప్రస్తుతం అమెరికా సుంకాలతో ఆక్వా రంగం ఇబ్బందులు పడుతోందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్లో ఈ నెల 26న నిర్వహించబోయే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
Union Minister Piyush Goyal: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తానని చెప్పారని.. ఆహామీని నిలబెట్టుకున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందని చెప్పారు.ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున ప్రారంభిస్తున్నామని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు.
ఎలక్ట్రిక్ వాహనాల (Evs) రంగం భారత్లో సిద్ధంగా ఉందని, కొత్త సబ్సిడీలు అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బ్యాటరీ ఖర్చులు తగ్గడంతో, ఈవీ వాడకం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉందని ఆయన చెప్పారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.