Share News

Minister Parthasarathi: జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి దారులు పారిపోయారు

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:34 PM

కూటమి పాలనలో తల్లికి వందనం, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని కొలుసు మంత్రి పార్థసారథి తెలిపారు. తమ ప్రభుత్వంలో పిల్లలను చదివించి, వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Minister Parthasarathi: జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి దారులు పారిపోయారు
Minister Parthasarathi

అమరావతి: గత జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి దారులు ఏపీ నుంచి పారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి (Minister Parthasarathi) విమర్శించారు. విద్యావిధానం పటిష్ట పరిచేందుకు విద్యార్థులకు స్కిల్ డెవలప్ చేస్తున్నామని అన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలను అవమానపరిచేలా వైసీపీ నేతలు వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చాలామంది వైసీపీ నేతలకు బెయిల్ దొరకటం లేదని చెప్పారు. ఇవాళ(శనివారం) అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేవలం ఓ వ్యక్తికి బెయిల్ దొరికితేనే అంతా బాగున్నట్లుగా వైసీపీ నేతలు ప్రవర్తించటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కూటమి సర్కార్ ఏడాది పాలనలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను ఏడాది పాలనలో అమలు చేశామని ఉద్ఘాటించారు మంత్రి కొలుసు పార్థసారథి.


తల్లికి వందనం పథకాన్ని ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరూ అమలు చేయలేదని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉన్నా పథకం అమలు చేశామని తెలిపారు. వైసీపీ అమ్మబడికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిందని.. పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష పార్టీ దేశంలో కేవలం వైసీపీనేనని విమర్శలు చేశారు. తల్లికి వందనంలో రూ. 2 వేలు మంత్రి నారా లోకేష్ జేబులో వేసుకుంటున్నారని వైసీపీ నేతలు అన్నారని.. ఈ విషయంలో లోకేష్ సవాల్‌కి సిద్ధమా అంటే వారు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రూ. 34 వేల కోట్లు ఏడాదిలో పెన్షన్ కిందా ఇచ్చామని చెప్పారు. వైసీపీ హయాంలో ఏ పథకాలు ఇచ్చారో తెలుసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి రూ. 1.04లు ఇచ్చామని గుర్తుచేశారు. జగన్ హయాంలో కేవలం రూ.64 వేలు మాత్రమే ఇచ్చారని.. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించారా అని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు.


సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం...

‘కూటమి పాలనలో తల్లికి వందనం, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నాం. మా ప్రభుత్వంలో పిల్లలను చదివించి, వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నాం. మేము సామాన్యులను ఎక్కడా కేసులు పెట్టి వేధించలేదు. గత వైసీపీ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో పని చేసింది. కూటమి పాలనలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలకు మంచి భవిష్యత్ ఇస్తాం. ఆ రెండు వేల రూపాయలను పాఠశాలలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు చేస్తాం. అశోక్ లేలాండ్, అమర్ రాజా లాంటి సంస్థలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి. గత జగన్ ప్రభుత్వంలో చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులకు.. మా ప్రభుత్వంలో వడ్డీలకే వేల కోట్లు చెల్లిస్తున్నాం. పోలవరాన్ని ధ్వంసం చేశారు. అమరావతి రాజధాని అని మూడు రాజధానులని చట్టం చేసిందే వైసీపీ. పోలవరం ప్రాజెక్టు 2027లోగా పూర్తి చేస్తాం. 87 లక్షల మంది ఉంటే 45 లక్షల మందికే ఎందుకు అమ్మవడి ఇచ్చారు’ అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు


ఇవి కూడా చదవండి

యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు

లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 02:28 PM