Home » Kolusu Partha Sarathy
మాజీ సీఎం జగన్పై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు.
రాష్ట్ర ఖజానాను జగన్ దివాలా తీయించారని మంత్రి పార్థసారథి విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన అప్పుల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతోందని మంత్రి తెలిపారు.
వ్యవసాయంలో ఈ ఏడాది 16 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్పై మంత్రి ప్రసంగించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు..
దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కీలక ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్ధసారథి చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్లో రూ.1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.
దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.శివకుమార్ తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాల గురించి మంత్రి కొలుసు పార్థ సారధి మీడియాకు వెల్లడించారు.
జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.
జగన్ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయిస్తారా? అని మంత్రి కొలుసు పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.