Parthasarathy On Unseasonal Rains: అకాల వర్షాలు, పంట నష్టంపై మంత్రి పార్థసారథి ఏమన్నారంటే
ABN , Publish Date - May 05 , 2025 | 04:57 PM
Parthasarathy On Unseasonal Rains: అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవడంతో , పంటనష్టం జరుగుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. రేపటికి పూర్తి సమాచారం ఇవ్వమని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు.

అమరావతి, మే 5: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలపై మంత్రి కొలుసు పార్థసారథి (Minister Parthasarathi) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల కలెక్టర్లను అకాల వర్షాలపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆదేశాలు ఇచ్చారన్నారు. రంగు మారినా కూడా ధాన్యాన్ని కొనాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. విపత్తుల నిర్వహణ వర్షాలు.. పిడుగులకు సంబంధించి ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తోందన్నారు. ఇంకా మెరుగ్గా విపత్తుల నిర్వహణ శాఖ వాతావరణం వివరాలు ఇవ్వాలని సీఎం సూచించారన్నారు.
అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవడంతో , పంటనష్టం జరుగుతుందన్నారు. రేపటికి పూర్తి సమాచారం ఇవ్వమని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, వడగాలులు, ఉరుముల, పిడుగుపాట్లు వంటి 30 సేవలు విపత్తు నివారణ శాఖ అందించాలని సీఎం సూచించినట్లు తెలిపారు.
AP Liquor Scam Latest Update: లిక్కర్ స్కాం.. జగన్ బ్యాచ్కు సుప్రీంలో ఎదురుదెబ్బ
రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్లకు ఒక కామన్ టెస్ట్ పెట్టి పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం అవసరం అయితే ఒక ఏజెన్సీ సహాయంతో పరీక్ష నిర్వహణపై దృష్టి పెడుతుందని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి కోసం పనిచేయడం, ముఖ్యమంత్రి మెప్పుకోసం పని చేయడం జరిగేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తి, సేవలు మెరుగుగా అందించటం ద్వారా ప్రజల సంతృప్తి అనే అంశంపై పనిచేస్తోందని వెల్లడించారు. వేలమంది లబ్దిదారుల అభిప్రాయం తీసుకున్నామని.. ప్రజల్లో సంతృప్తి పెరుగుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసాపై ఎక్కువ పర్సెంటేజే పెరిగిందన్నారు. రెవిన్యూ, హౌసింగ్పై సీఎం రివ్యూ చేశారని... ఈ శాఖలపై కూడా ప్రజల సంతృప్తి శాతం పెరిగిందని చెప్పుకొచ్చారుర. వాట్సప్ గవర్నెస్పై ఏడు లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు వినూత్న కార్యక్రమం ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. రాబోయే పరిశ్రమలకు స్కిల్ ఉన్నవారిని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జాబ్ డేటా యాప్ తయారుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్కిల్ టెస్ట్ కోసం ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తామన్నారు.
అవి ఇప్పటివి కాదేమో
ఎంపీ కేశినేని చిన్ని, కసిరెడ్డి వ్యవహారానికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ... ఎంపీ కేసినేని చిన్నికి , కసిరెడ్డి రాజ్కు వ్యాపార సంబంధాలు ఉంటే అవి ఇప్పటివి కాదేమో అని అభిప్రాయడ్డారు. వారి వ్యాపార సంబంధాలపై తనకు నాలెడ్జ్ లేదన్నారు. కేశినేని నాని, తను సోదరుడు ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు వాస్తవమైతే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్తో రైడ్.. వీడియో వైరల్
Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం
Read Latest AP News And Telugu News