Dokka Manikya Vara Prasad : అమరావతిని అలా అనటం దుర్మార్గం.. వైసీపీపై డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఫైర్
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:20 AM
రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే కృష్ణంరాజు అటువంటి వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు.

గుంటూరు జిల్లా: వైసీపీపై (YSRCP) మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ (Dokka Manikya Vara Prasad ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జరల్నిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. అటువంటి వ్యక్తులను చర్చలకు పిలవకుండా నిషేధం విధించాలని కోరారు. ఇవాళ(ఆదివారం) గుంటూరులో డొక్కా మాణిక్య వర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సజ్జల పే రోల్ జర్నలిస్టుల్లో కృష్ణంరాజు ఒకరని ఆరోపించారు. తన జీతం పెంచటం కోసం కృష్ణంరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చునని చెప్పారు డొక్కా మాణిక్య వర ప్రసాద్.
రాజధాని అమరావతిపై కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని డొక్కా మాణిక్య వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే కృష్ణంరాజు అలాంటి వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర లేదని గతంలో కూడా కృష్ణంరాజు మాట్లాడారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వ్యతిరేకి కృష్ణంరాజు అని మండిపడ్డారు. అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరి మానుకోవాలని హితవు పలికారు. మహిళలు, దళితులను కించపరిచే ఫ్యూడలిస్ట్ వ్యక్తులను సమాజం నుంచి వెంటనే బహిష్కరించాలని డొక్కా మాణిక్య వర ప్రసాద్ కోరారు.
కృష్ణంరాజు, కొమ్మినేనిలపై చర్యలు తీసుకోవాలి: గాదె వెంకటేశ్వరావు
రాజధాని అమరావతి మహిళల గురించి సాక్షి డిబేట్లో అసభ్యంగా మాట్లాడటం సిగ్గుచేటని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు అన్నారు. ఇవాళ(ఆదివారం) గుంటూరులో గాదె వెంకటేశ్వరావు మీడియాతో మాట్లాడారు. జర్నలిజం అనే ముసుగు వేసుకొని జగన్మోహన్ రెడ్డి కోసం వారు పని చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయలు విలువ కలిగే భూమిని రాజధాని కోసం రైతులు త్యాగం చేశారని కొనియాడారు. అలాంటి రాజధాని గురించి మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గడిచిన 5 సంవత్సరాలు మీడియాని సైతం జగన్మోహన్ రెడ్డి తొక్కి పెట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సాక్షిపై ప్రతీకారం తీర్చుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో సాక్షి పేపర్ ఛానెల్ను బాయికాట్ చేయాలని గాదె వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు
కన్నప్పలో బ్రాహ్మణులను కించపరిచారు
Read Latest AP News And Telugu News