AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - May 20 , 2025 | 09:02 AM
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో జరుగనుంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ఏడాది పాలనపై ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.

అమరావతి: ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) ఇవాళ(మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరుగనుంది. 25 అంశాల అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎస్ఐపీబీ 6వ సమావేశంలో అమోదించిన పలు సంస్థల పెట్టుబడులకు మంత్రి మండలి అమోదం తెలపనుంది. ఏపీ లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ 4.0కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఓకే చెప్పనుంది.
దీని ద్వారా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంది. వచ్చే జూన్ 12వ తేదీ నాటికి కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి అవుతుండటంతో ఈ సమావేశంలో చర్చించనున్నారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్కు పాలన పరమైన అనుమతులకు అమోదం పైనా కేబినెట్లో మాట్లాడనున్నారు. ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసే అంశంపై చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీలపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రి మండలి చర్చించనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ(మే20) బిజీ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు మఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. 11.00 గంటలకు కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు ఉండవల్లి నివాసానికి తిరిగి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Education Department: మోడల్ స్కూల్స్ కాంట్రాక్టు టీచర్ల రెన్యువల్
Kuppam: రేపు కుప్పం రానున్న చంద్రబాబు
APSRTC: పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్ అమలుపై మార్గదర్శకాలు
Read Latest AP News And Telugu News