AP News: టీడీపీ నేతల దారుణ హత్య.. పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు
ABN , Publish Date - May 25 , 2025 | 05:42 PM
Macherla case: గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు.

పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో (Macherla Constituency) శనివారం నాడు జంట హత్యలు జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు (TDP Leaders) వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను దారుణంగా హత్యచేశారు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్థులు ఢీకొట్టారు. కిందపడిన ఇద్దరిని గొడ్డళ్లతో నరికి ప్రత్యర్థులు చంపేశారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నరికి చంపేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలను దారుణంగా హత్య చేశారు.
గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై 302 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఏ 1 జవిశెట్టి శ్రీను, ఏ 2 తోట వెంకట్రామయ్య, ఏ 3 తోట గురువయ్య, ఏ 4 డి. నాగరాజు, ఏ 5 తోట వెంకటేశ్వర్లు, ఏ 6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ 7 పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పాశవికంగా పిన్నెల్లి సన్నిహితులు హత్య చేశారు: పల్లా శ్రీనివాసరావు
పల్నాడులో టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావుల దారుణ హత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వేటకోడవళ్లతో పాశవికంగా పిన్నెల్లి సన్నిహితులు టీడీపీ నేతలను హత్య చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్లీ పిన్నెల్లి అనుచరులు విఘాతం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ రాజకీయాలను పిన్నెల్లి అనుచరులు మళ్లీ పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. కూటమి పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తావులేదని హెచ్చరించారు. పిన్నెల్లి, అనుచరులపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం
For More AP News and Telugu News