Home » Pinnelli Ramakrishna Reddy
టీడీపీ నేతల హత్యకు సంబంధించిన కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు హైకోర్టులో ముందస్తు బెయిల్కు పిటిషన్ దాఖలు చేశారు. హత్య రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొంటూ, వారి పేర్లు తప్పుగా చేర్చారని పిటిషన్లో పేర్కొన్నారు.
Macherla case: గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు.
అల్లర్లు సృష్టించడానికే జగన్ విజయవాడకు వెళ్లారని టీడీపీ నేత బుద్దా వెంకన్నా ఆరోపించారు. పిన్నెలి రామకృష్ణ రెడ్డి, వంశీని కలిసిన జగన్ దళితుడైన నందిగామ సురేష్ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.
మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల అండతో అరాచకాలు, దోపిడీలకు పాల్పడిన మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తుర కా కిశోర్కు మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కొంతకాలంగా పలు కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలులో నుంచి బయటకి వచ్చిన వెంటనే పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఈరోజు (శనివారం) విడుదలకానున్నారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. ఈక్రమంలో పిన్నెల్లికి పలు కండీషన్లపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆయన బెయిల్పై జైలు నుంచి విడుదల అవనున్నారు.
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది.