Share News

AP News: వైసీపీ కీలక నేత అనుచరుడి దౌర్జన్యం. ఏం చేశారంటే..

ABN , Publish Date - May 18 , 2025 | 09:09 AM

Kakinada Land Grabbing Case: కాకినాడలో వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడు చేసిన భూ కబ్జా బయటకు వచ్చింది. తన భూమిని ద్వారంపూడి అనుచరుడు కబ్జా చేశారని పోలీసులకు రిటైర్డు ఎయిర్‌ఫోర్స్ అధికారి వెంకట రామానాయుడు ఫిర్యాదు చేశారు.

AP News: వైసీపీ కీలక నేత అనుచరుడి దౌర్జన్యం. ఏం చేశారంటే..
Kakinada Land Grabbing Case

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) కాకినాడలో భూకబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోరంగా ఓడిపోయి.. కూటమి ప్రభుత్వం (NDA Government) అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి వరుసగా గత జగన్ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భూకబ్జాలు చేసే అక్రమార్కులపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


తాజాగా కాకినాడలో వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడు చేసిన భూ కబ్జా బయటకు వచ్చింది. రూ.2కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారంటూ పోలీసులకు రిటైర్డు ఎయిర్‌ఫోర్స్ అధికారి వెంకట రామానాయుడు ఫిర్యాదు చేశారు. తన పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బుతో సర్పవరంలో 700 గజాలు కొనుగోలు చేశానని వెంకట రామానాయుడు తెలిపారు. ఖరీదైన స్థలాన్ని ద్వారంపూడి అనుచరుడు కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


తన స్థలం కోసం వెళ్తే కొన్నేళ్లుగా ద్వారంపూడి అనుచరుడు దౌర్జన్యం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఇటీవల తన స్థలం కబ్జాపై వెంకట రామానాయుడు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి సర్పవరం పోలీసులకు వెంకట రామానాయుడు, అతని భార్య ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేసి తననే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులతో తనను ద్వారంపూడి అనుచరుడు బెదిరించారని వెంకట రామానాయుడు వాపోయారు. ఈ వ్యవహారంతో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలు మరోసారి చర్చకు వచ్చాయి. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nara Lokesh: ఏపీకి మీ ఆశీస్సులు అందించండి

Governor Abdul Nazir: ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ

For More AP News and Telugu News

Updated Date - May 18 , 2025 | 09:12 AM