Home » Dwarampudi Chandra Sekhara Reddy
Kakinada Land Grabbing Case: కాకినాడలో వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అనుచరుడు చేసిన భూ కబ్జా బయటకు వచ్చింది. తన భూమిని ద్వారంపూడి అనుచరుడు కబ్జా చేశారని పోలీసులకు రిటైర్డు ఎయిర్ఫోర్స్ అధికారి వెంకట రామానాయుడు ఫిర్యాదు చేశారు.
Dwarampudi Chandrasekhar Reddy: కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డికి ఏపీ హై కోర్టులో బిగ్ షాక్ తగిలింది. వీరభద్ర రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉత్పత్తి నిలిపివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
కాకినాడ అంటే పెన్షనర్స్ ప్యారడైజ్. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ నగరానికి ఆ పేరు ఉంది. కానీ ఇప్పుడు వరుస కుంభకోణాలతో కాకినాడ కాకెక్కిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిలు వునా దోచేసి కాకినాడను కుంభకోణాల నగరంగా మార్చేశారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం అక్రమ రవాణా.. సీపోర్టులో బెదిరించి కేవీరావు నుంచి వాటాలను బలవంతంగా లాగేసుకున్న
కాకినాడ: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్ తగిలింది. రొయ్యల ప్రోసెస్ ద్వారా వచ్చే కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. ఫ్యాక్టరీల కాలుష్యంపై పీసీబీకి దొంగ లెక్కలతో మాయ చేస్తున్నారు. అనుమతి లేకుండా లోపల ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. గ్రీన్ బెల్ట్ లేకుండా ఉన్నట్లు మాయ చేసి చూపారు. వీటి ఉల్లంఘనలను అధికారులు తనిఖీల్లో గుర్తించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
లేకలేక అధికారం చేతికి రావడంతో ఎమ్మెల్యేగా ఉండగా ఆయన విర్రవీగిపోయాడు. నా అంతటోడు లేడనుకుని ఐదేళ్లు విచ్చలవిడిగా వ్యవహరించాడు. సాక్షాత్తూ సీఎం తనకు సన్నిహితుడు కావడంతో ఆ వంకతో నియోజకవర్గంలోను, జిల్లాలోను తానే ఓ సీఎం తరహాలో నిరంకుశంగా వ్యవహరించాడు. కనిపించిన కొండలు, గుట్టలను మింగేశాడు. తనకున్న వ్యాపారాలను నిబంధనలను ఖాతరు చేయకుండా నడిపాడు.. కన్నేసిన కోట్ల విలువైన భూములను కబ్జా చేసి పారేశాడు. అవినీతి, అక్రమాలకు ద్వారం తెరిచాడు..
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు. గతంలో వైసీపీ హయాంలో అడిగేవారు లేకపోవడంతో అక్రమ కట్టడం గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఒకట్రెండ్రోజుల ముందు కూడా వైసీపీ (YSR Congress) అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోంది. అధికారులు, పోలీసులు ఇలా ఎవర్ని ఎక్కడ వాడాలో అలా వాడేస్తోంది జగన్ సర్కార్. మరీ ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తుండటం దారుణం...
చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యేలైతే తమ నియోజకవర్గానికి చేసింది శూన్యం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు. నేడు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి చుక్కెదురైంది. తొలిరోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన్ను జనం నిలదీశారు.
కాకినాడ: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. మత్స్యకారులను అవమానించేలా ద్వారంపూడి మాట్లాడారంటూ మత్స్యకార సంఘాలు, టీడీపీ నేతలు మండిపడ్డారు. కోటి రూపాయలతో గుడి కడితే రూ. 10 కోట్లు వసూలు చేసే జాతి మీది అంటూ మాజీ ఎమ్మెల్యే కొండబాబును ద్వారంపూడి దూషించారు...
కాకినాడ పట్టణ నియోజకవర్గం వైసీపీ (YCP) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై (Dwarampudi Chandrasekhar Reddy) వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.