TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
ABN , Publish Date - Nov 29 , 2025 | 02:44 PM
తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
తిరుపతి, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో (TTD Adulterated Ghee Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు పోలీసులు.
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారిలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు.
ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పేర్లు ఇవే...
పల్లి ఈశ్వరరెడ్డి - వేర్ హౌస్ జేఏ
ముత్త వెంకట అనిల్ కుమార్ - జేఏ
వెంకట నగేశ్బాబు - రిటైర్ డిప్యూటీ ఈఓ,
పెరగు జగదీశ్వరరెడ్డి - ఈఈ
పీ. మురళి కృష్ణ - మార్కెటింగ్ జీఎం
సుబ్రమణ్యం మార్కెటింగ్ - మాజీ జీఎం
హరినాథ్రెడ్డి - గోశాల డైరెక్టర్
వీరితో పాటు డైరీ టెక్నాలజీ టెక్నికల్ టీంకు చెందిన డాక్టర్ మల్లం మహేందర్ రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎం విజయభాస్కరరెడ్డి, డాక్టర్ బత్తల సురేంద్రనాథ్, డాక్టర్ కే. జయరాజరావులను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం: త్రీ మెన్ కమిటీ
Read Latest AP News And Telugu News