Tirupati Land Grabbers: తిరుచానూరులో నాగాలమ్మ ఆలయాన్ని భూకబ్జాదారులు నేలమట్టం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భూకబ్జాదారులను గ్రామస్తులు చితకబాదారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. పదోన్నతుల పేరుతో గంగమ్మ గుడి భజంత్రీలకు వైసీపీ నేతలు టోకరా పెట్టారు. ఐదుమంది భజంత్రీలకు గ్రేడ్- 2 నుంచి గ్రేడ్ -1 కళాకారులుగా పదోన్నతి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక బిడ్డ ఉంటే రూ.13 వేలు. ఇద్దరికైతే రూ.26 వేలు.. ముగ్గురున్న వారికి రూ.39 వేలు. ఇలా ‘తల్లికి వందనం’ పథకం కింద శుక్రవారం తల్లుల ఖాతాల్లో నగదు జమ అయింది. గత ప్రభుత్వం ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ‘అమ్మ ఒడి’ ఇస్తామని, చివరకు ఒకరికేనంటూ మోసం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల నాటి హామీని నిలబెట్టుకోవడంతో విద్యార్థుల తల్లులకు వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే రూ.54.562 కోట్ల వరకు అదనపు లబ్ధి చేకూరింది.
రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది నిండుప్రాణాలు బలయ్యాయి.17మంది గాయాలపాలై ఆస్పత్రుల పాలయ్యారు.ఈ రెండు ప్రమాదాలకూ అతివేగమే కారణం కావడం విశేషం.ఒక ప్రమాదంలో లారీని ఓవర్ టేక్ చేయబోయిన ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు కాగా మరో ప్రమాదంలో సర్వీసు రోడ్డుపై వెళుతున్న ఇద్దరిని ఢీకొట్టి మృత్యుఒడికి చేర్చిన కారు ధ్వంసమైంది. ప్రాణాలు కోల్పోయారు. Eight people were killed in two road accidents. 17 people were injured and hospitalized. Speeding was the cause of both accidents.
Road Accident: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరంతా రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది.
మద్యం సేవించి భార్యను తరచూ వేధించడంతో పాటు కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేస్తున్న తండ్రిని ఆయన కుమారుడే నరికి చంపాడు. తల్లిని చంపడానికి కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే అదే కత్తిని తీసుకుని తండ్రిని హతమార్చాడు.
తోతాపురి మామిడి కాయలకు మద్దతు ధర అమలులో అధికార యంత్రాంగానికి గుజ్జు పరిశ్రమల నుంచి సహకారం అందడం లేదు. మామిడి రైతులను ఆదుకునేందుకు తోతాపురికి మద్దతు ధర రూ.12 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.4 సబ్సిడీపై ఇస్తామని చెప్పడంతో రైతులు ఆనందపడ్డారు.
సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ రోజుకో మలుపు తిరుగుతోంది.స్పౌజ్ కేసుల్లో జీవో ప్రకారం బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు పట్టుపడుతుండగా నిబంధనల ప్రకారమే చేస్తున్నామంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాకు మరో 13 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రానున్నాయి. తొలి దశలో జిల్లాకు 26,639 క్వింటాళ్ల విత్తనకాయలు కేటాయించారు. ఈనెల నాల్గవ తేదీన పంపిణీ ప్రారంభించగా, గురువారం నాటికి 53,747 మంది రైతులకు 21,639 క్వింటాళ్ల విత్తనాలు అందజేశారు.
తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భజంత్రీలుగా పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందిని వైసీపీ అధికారంలోని కొందరి చర్య వలన బలిపశువులగా మారారు. దేవదాయశాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయంటూ పదోన్నతి కల్పించేసి వారి కళ్లల్లో నింపిన ఆనందాన్ని మూన్నాళ్ల ముచ్చటగా మార్చారు.