Home » Tirumala Laddu
జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.
గత వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యి కల్తీ.. పరకామణిలో చోరీ కేసు రాజీ.. చివరికి శ్రీవారిని దర్శించే ప్రముఖులు, భక్తులకు కప్పే పట్టువస్త్రాల కొనుగోలులోనూ దగా.. పట్టు పేరిట పాలిస్టర్ వస్ర్తాలు కొనుగోలు చేసి మోసం చేశారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.
తిరుమల లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి వాడకంపై లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయని అన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.
అక్టోబర్ మాసంలో శ్రీవారిని ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలను టీటీడీ ప్రకటించింది. అలాగే లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం వివరాలను కూడా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ వెల్లడించారు.
లడ్డూ ధరల పెంపు వార్తలను టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా ఖండించారు. కావాలనే కొన్ని ఛానళ్లు పని గట్టుకొని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.