Share News

Paritala Sunitha: టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

ABN , Publish Date - May 24 , 2025 | 08:40 PM

Paritala Sunitha: ఐదేళ్లు కార్యకర్తలు కష్టపడ్డారని.. ఒక్కొక్కరిపై గత జగన్ ప్రభుత్వంలో 20, 30 కేసులు పెట్టారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు ఇంకా అదే ముసుగు వేసుకున్నారని.. టీడీపీ కార్యకర్తలపైనే కేసు పెడుతున్నారని మండిపడ్డారు.

Paritala Sunitha: టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
Paritala Sunitha

శ్రీ సత్యసాయి జిల్లా: కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ (YSRCP) కండువా కప్పుకుని పనిచేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శనివారం) శ్రీ సత్యసాయి జిల్లాలో మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ టీడీపీ అని ఉద్ఘాటించారు. ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశమని గుర్తుచేశారు పరిటాల సునీత.


ఐదేళ్లు కార్యకర్తలు కష్టపడ్డారని.. ఒక్కొక్కరిపై గత జగన్ ప్రభుత్వంలో 20, 30 కేసులు పెట్టారని పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు ఇంకా అదే ముసుగు వేసుకున్నారని.. టీడీపీ కార్యకర్తలపైనే ఇంకా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చేలా పని చేస్తామని అన్నారు. జాకీ పరిశ్రమ ఓ దుర్మార్గుడు నిర్వాకం వల్ల వెనక్కి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. పరిటాల రవీంద్రకి రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు ఎన్ఠీఆర్ అని ఉద్ఘాటించారు. చంద్రబాబుకు ఇచ్చిన మాట కోసం పార్టీ టికెట్‌ను పరిటాల శ్రీరామ్ త్యాగం చేశారని గుర్తుచేశారు. ధర్మవరం టీడీపీ కార్యకర్తలు నేతలు ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని… ప్రతి కార్యకర్తను పరిటాల కుటుంబం కాపాడుకుంటుందని పరిటాల సునీత హామీ ఇచ్చారు.


చివరి వరకు తాను టీడీపీలోనే ఉంటా: పరిటాల శ్రీరామ్

Paritala--Sriram.jpg

చివరి వరకు తాను టీడీపీలోనే ఉంటానని ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. ఆ రోజు పరిటాల రవీంద్రకు ఎన్టీఆర్ పసుపు కండువా వేసి పార్టీలోకి చేర్చుకున్నారని గుర్తుచేశారు. తనకు నందమూరి బాలకృష్ణ పచ్చ కండువా వేసి పార్టీలోకి తీసుకువచ్చారని అన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషన్ అవార్డు వచ్చిన నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ పెట్టిన తీర్మానాన్ని బలపరిచే అవకాశం తనకు కల్పించినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు పరిటాల శ్రీరామ్.


నందమూరి కుటుంబానికి మన జిల్లాకు విడదీయరాని బంధం ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పటికీ ఆరోజు ఎన్టీఆర్ హిందూపురం నియోజకవర్గాన్నే ఎంచుకున్నారని గుర్తుచేశారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని ముందుకు నడిపించేందుకు ఆయన చూపిన చొరవ మరువలేనిదని అన్నారు. రాజకీయంగా ఇక్కడున్న ఇబ్బందులను తొలగించి.. ప్రజలకు సమస్యలను దూరం చేశారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన పరిటాల రవి.. నిలబడిన ఆశయాలు తనకు వారసత్వంగా వచ్చాయని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

NITI Aayog Meeting: స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్‌లో ప్రశంసల వర్షం

Tirumala: చంద్రబాబు వచ్చిన తర్వాత తిరుమలలో గత 11 నెలల్లో అనేక మార్పులు..

Read latest AP News And Telugu News

Updated Date - May 24 , 2025 | 10:18 PM