Home » West Bengal
భారతీయ జనతా పార్టీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని 'అనాగరిక' పార్టీగా అభివర్ణించారు. దేశంలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బహ్రాంపుర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు కనీసం మాంసం, గుడ్లు తినే పరిస్థితి కూడా ఉండదని అన్నారు.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల వాతావరణం శనివారంనాడు ఒక్కసారిగా వేడెక్కింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రధానాస్త్రంగా చేసుకుని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారం సాగించగా, శ్రీరామ నవమి ఊరేగింపులో అల్లర్లు, చొరబాటుదార్ల సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రచారం జరిపారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బెంగాల్ను నాశనం చేసే ప్రయత్నంలో ఆ పార్టీ దేశంలోనే అధికారంలో లేకుండా పోతుందని అన్నారు. ఢిల్లీని పట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను తాను ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు.
తాను అధికారంలో ఉన్నంత వరకూ పశ్చిమబెంగాల్లో ఎన్ఆర్సీని అనుమతించేది లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నక్సల్బరీలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR)పై తాము సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని, ప్రజల ఓటింగ్ హక్కులను లాక్కునేందుకు ప్రధానమంత్రి మోదీ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే 291 మంది అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు గట్టి పట్టున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.