Home » West Bengal
ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు పశ్చిమబెంగాల్లోని సాల్ట్ లేక్లో ఉన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లూబీఎస్ఎస్సీ) కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు.
మహాకుంభ్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్లో అనేక మందిని ఎన్కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పారు.
ధులియాన్ నుంచి మాల్డాలోని సహాయక శిబిరానికి తరలిపోయిన పలు కుటుంబాలను భారీ భద్రత మధ్య వెనక్కి తీసుకువస్తున్నారు. భాగీరథీ నది మీదుగా పడవల్లో ప్రజలను వెనక్కి తీసుకువస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తు్న్నాయి.
JEE topper Archisman Nandy: పరీక్షకు మూడు రోజుల ముందు ఆర్కిస్మ్యాన్ నాండి కారు ప్రమాదానికి గురయ్యాడు. తల్లిదండ్రులతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన మూడు రోజులకు ఆర్కిస్మ్యాన్ నాండి జేఈఈ మెయిన్ సెసన్ 1 పరీక్ష రాశాడు. 99 శాతం స్కోర్ చేశాడు.
అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి యథాపూర్వ పరిస్థితి నెలకొనాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అన్నారు.
హింసాకాండ చెలరేగిన ముర్షీదాబాద్ జిల్లాలో మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జాంగిపూర్, ముర్షీదాబాద్, బహ్రాంపూర్. మూడు నియోజకవర్గాలకు టీఎంసీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాంగిపూర్కు ఖలీలుర్ రెహమాన్, ముర్షీదాబాద్కు తహెర్ ఖాన్, బహ్రాంపూర్కు యూసఫ్ పఠాన్ ఎంపీలుగా ఉన్నారు.
Bengal BJP Ex President Dilip Ghosh: అయితే, కొడుకు పెళ్లి విషయంలో ఆయన తల్లి బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోమని బతిమాలేది. ఆయన పట్టించుకోలేదు. చివరకు తల్లి మాటకోసం రింకు మజుందార్ను పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం అతికొద్దిమంది బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి జరిగింది.
India: పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై బంగ్లాకు చెందిన ఓ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని ఖండిస్తూ భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమైన వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకించడంలో టీఎంసీ ముందుందని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ ఆమోదించిన ప్రజా వ్యతిరేక బిల్లులను కేంద్రంలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన తర్వాత రీకాల్ చేస్తామని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల వెనుక బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మమతా బెనర్జీ సర్కారు చొరబాటుదార్లను అడ్డుకోవడంలో విఫలమైంది