Home » Summer
ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటకు వెళ్తే ఎండల తీవ్రతతో జనాలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా ఏసీ, కూలర్ లేకుంటే ఇంట్లో కూర్చోవడం కష్టంగా మారింది. పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు..
వేడి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇంట్లో కూడా వేడి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో సహజంగా ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఇండోర్ మొక్కలు మంచి పరిష్కారం.
తమిళనాడు, పుదుచ్చేరిలో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరంలో రోజుకు 8వేల వరకు వాటర్బోర్డు ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేస్తున్నారు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి అవసరాలు పెరిగాయి.
భానుడి భగభగలతో నగర ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేసవి కాలంలో ఎండలు పెరిగే కొద్దీ ఇళ్లలో ACలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగి బిల్లులు కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే వేసవిలో కూడా విద్యుత్ బిల్లులను నియంత్రించుకోవచ్చు.
శివారు ప్రాంతాల్లో ఉదయం పొగ మంచు కురుస్తుంటే, మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏలూరు నగరంలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.
మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు ముందస్తుగానే ముదురుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అప్పుడే వేసవి తాపం మొదలైంది.