Home » Summer
మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికితోడు పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల వేడి, ఉక్కపోత కొనసాగాయి.
రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలతో ఎండ తీవ్రత కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు మరియు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
మామిడిపండ్లంటే ఇష్టపడని వారుండరు. అయితే.. ఈ పండ్లను కార్బైడ్తో మాగబెడుతూ విషతుల్యం చేస్తున్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల దగ్గర తక్కువ ధరకు తెస్తున్న వ్యాపారులు వాటిని గోదాముల్లో కార్బైడ్తో మాగబెడుతున్నారు. వీటిని తినడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Summer Workout Tips: వేసవిలో విపరీతమైన ఎండల కారణంగా ఏ పని చేయకపోయినా త్వరగా అలసట, నీరసం ఆవహిస్తాయి. ఉత్సాహంగా ఉండలేరు. అయితే, ఈ సరదా వర్కవుట్లతో ఈ సమస్యలకు ఈజీగా తరిమికొట్టచ్చు.
వేసవికాలం వచ్చిందంటే.. కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే.. దొంగతనాలకు ఇదొక సీజన్ లాంటిదని చెప్పవచ్చు. వేసవిలోనే వివాహాలు, సమ్మర్ ట్రిప్ వంటింవి ఉంటాయి. ఇది దొంగలకు అనువైన అవకాశం. అయితే... ఈ సీజన్లో జర జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్బీ)లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఏరియాలోని వారికి ఇది ఉపయోగకరంగా మారనుంది. అలాగే తక్కువ ఫీజుతో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు అవకాశం కల్పించారు.
ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చేశారు. అయితే.. ఇంటివద్ద ఉండే చిన్నారులు బయట ఎండలో ఆటలాడుతుంటారు. ఈ క్రమంలో వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాగా.. వేసవిలో పిల్లలు అస్వస్థతకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీపుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Running Fan With AC: ఎయిర్ కండిషనర్లను ఉపయోగిస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్లను ఆఫ్ చేయడం మంచిదని మనం తరచుగా అనుకుంటాము. అయితే, ఈ అభిప్రాయంలో నిజమెంత.. లేకపోతే కేవలం అపోహేనా.. AC ఆన్లో ఉన్నప్పుడు ఫ్యాన్ను ఆన్లో ఉంచడం సరైందేనా కాదా అని తెలుసుకుందాం.
నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. వేసవి రద్దీ నేపథ్యంలో బెర్హంపూర్ మార్గంలో రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ రైళ్లు చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల వరకు చేరతాయని, కొంతమంది ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తా జిల్లాలకు కూడా భారీ వర్షాలు, ఈదురుగాలులు అనుకోకుండా తీవ్రత చూపిస్తాయని వెల్లడించింది.