Special Trains: నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - May 08 , 2025 | 07:37 AM
నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. వేసవి రద్దీ నేపథ్యంలో బెర్హంపూర్ మార్గంలో రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ రైళ్లు చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.

- చర్లపల్లి-బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ సిటీ: వేసవి రద్దీ నేపథ్యంలో చర్లపల్లి-బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 9 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు చర్లపల్లి నుంచి బెర్హంపూర్కు (07027).. ఈ నెల 10 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం బెర్హంపూర్ నుంచి చర్లపల్లికి(07028) ప్రత్యేక రైలు బయల్దేరనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎయిర్గన్తో హల్చల్ చేసి.. ప్రియురాలితో ఎంజాయి చేసేందుకు వచ్చి..
ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ(Nalgonda, Miryalaguda, Sattenapalli, Guntur, Vijayawada), ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్లలో ఆగుతాయని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్లో పాక్ యాంకర్ కన్నీరు..
Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత
Operation Sindoor: సిందూరమే.. సంహారమై
CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు
Read Latest Telangana News and National News