Home » Special trains
రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే స్పెషల్ వీక్లీ రైళ్లను పొడిగించి (స్టేషన్ల సంఖ్య పెంపు) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు సోమ, బుధవారాల్లో ఈ నెల 4 నుంచి 29 వరకు జహనాబాద్ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు చెప్పారు.
ఓనం పండుగను పురస్కరించుకుని చెన్నై సెంట్రల్-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.06119 చెన్నై సెంట్రల్-కొల్లం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 27, సెప్టెంబరు 3,10 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా(06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు(ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు.
హైదరాబాద్(Hyderabad) నుంచి కన్నియాకుమారికి జూలై 2వ తేదీ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
వాడి జంక్షన్ సమీపం హల్కట్టా షరీఫ్ వద్ద జరిగే ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం జూలై 9, 11 తేదీల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. వేసవి రద్దీ నేపథ్యంలో బెర్హంపూర్ మార్గంలో రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ రైళ్లు చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.
ప్రస్తుత వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటు మరికొన్ని స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలు దేరనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని జనవరి నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి బయలు దేరే, తిరిగి వచ్చే రైళ్ల వివరాలను వెల్లడించారు.
పొంగల్(Pongal) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06569 బెంగళూరు-తూత్తుకుడి ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేది బెంగళూరులో రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది.
కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు నడపనున్న ప్రత్యేక రైళ్లల్లో ఇంకా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. పండుగ రోజుల్లో ఊరు వెళ్లాలనుకునేవారికి నిజంగా ఇది పండుగలాంటి వార్తగానే చెప్పుకోవాలి. జనవరి 14, 15 తేదీల్లో మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లాలంటే ఎలాంటి చింత అవసరం లేదు. జనరల్ కేటగిరీలో వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి.