Special Trains: 11న హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:47 AM
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
- వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల డిమాండ్ను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక రైళ్లు నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 24న చర్లపల్లి-మంగళూరు జంక్షన్(07267), 26న మంగళూరు జంక్షన్-చర్లపల్లి (07268), 28న చర్లపల్లి-మంగళూరు సెంట్రల్(07269), 30న మంగళూరు సెంట్రల్-చర్లపల్లి(07270), డిసెంబర్ 11న హైదరాబాద్-తిరుపతి (07690) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
Read Latest Telangana News and National News
