Home » PV Narasimha Rao
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు తెలిసింది.
PV Statue: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత స్థలంలో తగు ఏర్పాట్లకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ పలు సూచనలు చేసింది.
కాంగ్రెస్కు ఎంతో చేసిన పీవీ నర్సింహారావు మరణాంతరం ఆ పార్టీ అవమానించిందని పీవీ సోదరుడు పీవీ మనోహర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అనూహ్యంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చేశారు! నాటి ప్రధాని పీవీ నరసింహారావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు!
నవోదయ విద్యాలయాన్ని వంగరలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వారసత్వం లేకుండా నాటి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చిన వ్యక్తి పీవీ అని చెప్పారు.
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని, గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు.
ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఫలితంగా దేశం ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఈ ఆర్థిక సంస్కరణలు ఎందరో పారిశ్రామిక వేత్తలను తయారు చేశాయి.
పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 2021 నుంచి 2023 వరకు జరిగిన అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ డీజీ రీతూరాజ్కు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఫిర్యాదు చేశారు.
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.