Home » Politicians
సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్-2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఓసారి జగన్ ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకుంటే.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం.. మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ.. ప్రకృతి వనరులకు చెర.. విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా.. అంతులేని అవినీతి, కమీషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఎన్నో అరాచకాలు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (86) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన స్థానిక రాజేంద్రనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు లేఖ పంపారు. గత ఆరునెలలుగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకుని..
తన తండ్రి ముద్రగడ పద్మనాభం ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని రాజమహేంద్రవరంలో నివాసముంటున్న ఆయన కూతురు క్రాంతి శుక్రవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నాన్ అఫిషియల్ పర్సన్ ఇన్చార్జిగా అమాస రాజశేఖర్రెడ్డి నియమితులయ్యారు.
జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుండగా, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పర్యాటక అభివృద్ధికి భారీగా కేంద్ర నిధులతో హోటళ్లు, బోటు షికార్లు, టెంట్ సిటీల ఏర్పాట్లపై ప్రణాళికలు కొనసాగుతున్నాయి.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణిని బెంగళూరు శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయనపై ఎస్టీల బెదిరింపులు, ఫోర్జరీ కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది.
31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్ డివిజన్లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
విద్యుత్ ఒప్పందాలపై జగన్మోహన్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలను ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. యాక్సిస్తో ఒప్పందం రాష్ట్రానికి అన్ని విధాలా మేలే అని తెలిపారు.