Home » Mumbai
ముంబైలోని ములంద్ ఏరియాలో ఓ ఇద్దరు అబ్బాయిలు.. ఓ అమ్మాయి కోసం రైలు పట్టాలపై పడి కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రియుడి కోసం ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని కన్నతండ్రికి విషం ఇచ్చి చంపేసింది. అయితే, 3 ఏళ్ల తర్వాత విషయం బయటపడింది.
ఓ యువతి మంటల్లో చిక్కుకున్న కుక్క కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఏ మాత్రం భయపడకుండా మంటల్లోకి వెళ్లి దాన్ని కాపాడింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ హర్మాన్ కౌర్ చనిపోయింది. 16 రోజులకు పైగా కోమాలో ఉన్న ఆమె గురువారం ప్రాణాలు విడిచింది. కౌర్ మృతితో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ముంబైలో జరిగిన ఐఏఏపీఐ ఎక్స్పోలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్లు, వాటర్ పార్క్లు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లను మంత్రి ఆహ్వానించారు.
ముంబైలోని పారెల్ ఏరియాలో ఇళ్ల అద్దెలు చాలా దారుణంగా ఉంటున్నాయి. కొందరు 2బీహెచ్కే కోసం ఏకంగా లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు.
ముంబై నగరానికి లోకల్ ట్రైన్లు జీవనాడి వంటివి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే ఈ రేళ్లలో కనీసం నిలబడటానికి కూడా చోటు దొరకదు. అలాంటిది ముంబై సబర్బన్ రైల్వేలో రద్దీగా ఉండే విరార్ వెళ్లే రైలులో ఒక మహిళ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే..
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వాంఖడే స్టేడియానికి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, భార్య సాక్షితో కలిసి వచ్చాడు. ప్రత్యేక గ్యాలరీ నుంచి వీరు మ్యాచ్ను వీక్షించారు. అయితే.. బుమ్రా క్యాచ్ పట్టడంతో సాక్షి ఎగిరి గంతేయగా.. ధోనీ స్పందించి ఆమెను నిలువరించాడు. ఈ ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఓ దొంగ పోలీసులకు దొరికిపోయాడు. అయితే స్టేషన్లో ఉన్న ఆ దొంగకు పోలీసులు ఓ పరీక్ష పెట్టారు. జేబులు ఎలా కత్తిరిస్తావో.. ఇక్కడ చేసి చూపించు అని ఆదేశించారు. దీంతో ఆ దొంగ తన వద్ద ఉన్న చిన్న కత్తిని బయటికి తీశాడు. అక్కడే ఉన్న..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మాజీ క్రికెటర్లు ఈ వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.