Home » Jai Shankar
మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, భారత నౌకల భద్రతకు సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రౌండ్లు చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ గురువారంనాడు తెలిపింది.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.
వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే భారత దేశ విధానమని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. చమురు కొనుగోళ్లకు సంబంధించి భారతీయ కంపెనీలు తమ ప్రయోజనాలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటాయని అన్నారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పై పాకిస్థాన్ యంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఓ సదస్సులో పాల్గొన్న జైశంకర్.. పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ గురించి మాట్లాడారు.
మలేషియా రాజధాని కౌలాలంపుర్ లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కౌలాలంపుర్లో భేటీ అయ్యారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాస్కోలో సమావేశమయ్యారు. ఈ భేటీ భారత్-రష్యా సంబంధాల్లో మరింత బలాన్ని తీసుకురావడంలో కీలకంగా మారింది.
ఏప్రిల్ 22 భారత్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా చూసిందని, జమ్మూకశ్మీర్లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడని జైశంకర్ పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి జవాబుగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నెల రోజుల అనంతరం యూరప్లో జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బెల్జియం, లక్సంబర్గ్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
Jaishankar On India Pakistan Ceasefire: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం కృషి చేసింది మేమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మా వల్లే.. అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. తాజాగా కాల్పుల విరమణకు సహకరించిన అమెరికాకు థ్యాంక్స్ చెప్తారా? అని అంతర్జాతీయ మీడియా ప్రశ్నించగా.. భారత విదేశాంగమంత్రి జై శంకర్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.
భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని చెప్పారు.