Share News

Pakistan: చైనా, టర్కీ మాత్రమే కాదు.. పాకిస్థాన్‌కు ఆయుధాలు ఇస్తున్న మూడో దేశం ఏంటో తెలుసా

ABN , Publish Date - May 22 , 2025 | 08:00 PM

భారత్‌పై డ్రోన్లు, మిసైళ్లతో దాడికి దిగుతున్న పాకిస్థాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తుంటుంది. అలాగే టర్కీ కూడా పాక్‌కు ఆయుధ సహాయం చేస్తుంటాయి. అయితే ఈ రెండు దేశాలు మాత్రమే కాదు.. మరో దేశం కూడా పాక్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఆ దేశం ఏదో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Pakistan: చైనా, టర్కీ మాత్రమే కాదు.. పాకిస్థాన్‌కు ఆయుధాలు ఇస్తున్న మూడో దేశం ఏంటో తెలుసా
Arms

మన శత్రు దేశం అయిన పాకిస్థాన్‌ (Pakistan)కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తుంటుంది. అలాగే టర్కీ (Turkey) కూడా పాక్‌కు ఆయుధాలు అందిస్తుంటుంది. అయితే ఈ రెండు దేశాలు మాత్రమే కాదు.. మరో దేశం కూడా పాక్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఆ దేశం ఏదో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ దేశం యూరప్‌లో ఉన్న నెదర్లాండ్స్. చైనా (China) తర్వాత పాకిస్తాన్‌కు రెండో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా నెదర్లాండ్స్ (Netherlands) ఉంది.


పాకిస్థాన్‌కు సహాయం చేస్తున్న నెదర్లాండ్స్‌కు కూడా టర్కీకి ఎదురైన అనుభవమే ఎదురుకావచ్చు. అలా జరిగితే నెదర్లాండ్స్‌కు పెద్ద ఇబ్బంది ఎదురుకావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నెదర్లాండ్స్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మన దేశ విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. ఆరు రోజుల ఈ పర్యటనలో భాగంగా జై శంకర్ డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. మే 19వ తేదీన నెదర్లాండ్స్‌కు జైశంకర్ నేరుగా చేరుకున్నారు.

shankar.jpg


ఆపరేషన్ సిందూర్ తర్వాత జై శంకర్ తొలి విదేశీ పర్యటన ఇదే. అది కూడా పాకిస్థాన్‌కు రెండో అతిపెద్ద ఆయుధాల సరఫరా దేశమైన నెదర్లాండ్స్‌కు జైశంకర్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ ప్రధాని, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రిని జైశంకర్ కలిశారు. అనంతరం సోషల్ మీడియాలో ఆ సమావేశం గురించి ట్వీట్ చేశారు. నెదర్లాండ్స్‌ ప్రధానికి మన ప్రధాని మోదీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసినట్టు చెప్పారు.


భారతదేశం, నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని నెదర్లాండ్స్ ప్రధాని అభిలషించారని, . ఈ లక్ష్యాలను సాధించడానికి రెండు దేశాలు కష్టపడి పనిచేస్తాయని నమ్మకం ఉందని జైశంకర్ అన్నారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెదర్లాండ్స్ దృఢ వైఖరికి ధన్యవాదాలు తెలియజేసినట్టు తెలిపారు. కాగా, పెహల్గాంలోని జరిగిన ఉగ్రదాడిని నెదర్లాండ్స్ ఖండించింది. అయితే కాల్పుల విరమణ ప్రకటించి రెండు దేశాలు చర్చించుకోవాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 22 , 2025 | 08:00 PM