Home » Etela rajender
మేడారం సమ్మక్క-సారక్క జాతరకు సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లైన్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
కమలం పార్టీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బహిరంగంగా చేసిన తీవ్ర విమర్శలు బీజేపీతోపాటు మిగతా రాజకీయ పక్షాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యమవుతుందా అని బీజేపీ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సీఎం రేవంత్ను ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు వేసిన కాళేశ్వరం కమిషన్ ముందు వింత వింత సంగతులు బయటకొస్తున్నాయి. ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఈటల మాటలపై తుమ్మల మండిపడ్డారు.
ఈటల రాజేందర్.. నువ్వు బీజేపీ ఎంపీవా? బీఆర్ఎస్ నేతవా? అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు. గతంలో పీసీసీ చీఫ్గా చేసినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఒక్కటే విధానంతో ఉన్నారని తెలిపారు.
ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్, మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Etela Inquiry: కాళేశ్వరం కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అంతా నిజమే చెబుతాను అంటూ ఈటెలతో ప్రమాణం చేయించిన అనంతరం కమిషన్ విచారణను షురూ చేసింది.
Mahesh Kumar Goud: కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని... వేల కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో ప్రధాని సహా పలువురు అనేక సార్లు ఆరోపణలు చేశారని మహేష్ కుమార్ గుర్తుచేశారు. కానీ ఈటెల అందుకు భిన్నంగా కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే కేసీఆర్తో కుమ్మక్కైనట్లు స్పష్టమైందని ఆరోపించారు.
Etela Rajender: 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా వాల్యూతో ఉన్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్నారు. తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని చెప్పారు.