Etela Rajender Ashwini Vaishnaw: మేడారం రైల్వే లైన్ను పరిశీలించండి..
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:46 AM
మేడారం సమ్మక్క-సారక్క జాతరకు సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లైన్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఎంపీ ఈటల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క-సారక్క జాతరకు సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లైన్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పార్లమెంటులోని కార్యాలయంలో కేంద్ర మంత్రితో భేటీ అయి ఆయన వినతిపత్రం అందించారు.
అలాగే విధి నిర్వహణలో ఉండగా మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. అయోధ్య ఎక్స్ రోడ్డు వద్ద ఆర్వోబీ నిర్మాణం త్వరగా చేపట్టాలని ఈటల కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News