Home » Election Commission of India
అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.
వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.
హైదరాబాద్లోని నాంపల్లి మనోరంజన్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(శనివారం) హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో జరిగే ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సన్నాహకాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ ఎన్నికల అధికారులు లేఖ రాశారు..
మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..
నెల్లూరు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఉదయం11 గంటలకి ఎన్నిక నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 80 వార్డులకు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతకు తెరలేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఈ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు కఠిన నిబంధనల మధ్య మొదలైంది.