Home » DK Shivakumar
తన వద్ద రూ.9 లక్షలు విలువచేసే రోలెక్స్, రూ.23.9 లక్షలు, రూ.12.06 లక్షలు విలువ చేసే రెండు కార్టియర్ వాచ్లు ఉన్నట్టు లోకాయుక్తకు తాను అఫిడవిట్ సమర్పించినట్టు డీకే శివకుమార్ తెలిపారు. ఆ డాక్యుమెంట్ కాపీని కూడా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేశారు.
సీఎం సిద్ధారామయ్యతో పాల్గొనాల్సిన ఒక కార్యక్రమం కోసం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఉదయం మంగళూరు వచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే మద్దతుదారులు ఈ సందర్భంగా డీకే-డీకే అంటూ నినాదాలు చేశారు.
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ మిగతా పదవీకాలం రెండున్నరేళ్లలో ఎవరు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలనే అంశం రసకందాయంలో పడింది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరుగగా, ఇవాళ..
నాయకత్వ మార్పుపై అందరిలోనూ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో డీకేకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. రెండో రౌడ్ బ్రేక్ఫాస్ట్ చర్చలు ఈసారి డీకే నివాసంలో జరిగాయి.
సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకునేందుకు ఢిల్లీ ప్రయాణానికి డీకే సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు డీకే సురేష్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే అధికార మార్పిడి అంశంపై సోదరులిద్దరూ పెదవి విప్పడం లేదు.
ఆర్థికశాస్త్రంలో నిపుణులైన మన్మోహన్ను ప్రభుత్వాధిపతిగా సోనియాగాంధీ ఎన్నుకున్నారని, ఆశా వర్కర్ల స్కీమ్ వంటి పలు సంక్షేమ చర్యల్లో ఆమె నాయకత్వ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
సీఎం పోస్టుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా, డీకే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుందన కర్ణాటక రైతుల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తానని చెప్పారు.
మాలో ఎటువంటి గ్రూపులు లేవు... 2028లో కూడా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవన్నారు.