Home » DK Shivakumar
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలేపాయి. అధికార పంపకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సిద్ధరామయ్య అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ సి.మోహన్ కుమార్, డీకే శివకుమార్ ప్రత్యేక అధికారి హెచ్.ఆంజనేయ మధ్య మాటల యుద్ధం దాడులకు దారితీసిందని తెలుస్తోంది.
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతోపాటు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష నియామకాలకు సంబంధించి అధిష్టానతో చర్చించేందుకు సీఎంతో కలసి ఢిల్లీ వెళ్లనున్నట్టు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం సదాశివనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధిష్టానంతో భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు.
మైసూరులో శనివారంనాడు ఏర్పాటు చేసిన సాధానా సమావేశంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. డీకే శివకుమార్తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు.
శ్రీరంగపట్న ప్రాంతంలోని ఎక్స్ప్రెస్వేపై గౌడహళ్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్ వాహనం డివైడర్ను ఢీకొట్టి తల్లకిందులైంది. క్షతగాత్రులను మైసూరులోని ఆసుపత్రికి తరలించారు.
నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పడు అధికార పంపకాల విషయంలో సిద్ధరామయ్య, డీకే మధ్య ఒక అవగాహన కుదిరిందనే వాదన మొదట్నించీ వినిపిస్తోంది. మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా పగ్గాలు పట్టుకుంటే, తక్కిన రెండున్నరేళ్లు డీకే పగ్గాలు చేపడతారనేది ఆ ఒప్పందం.
ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్ ఒక్కసారిగా దిగాలు పడ్డారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్చల్ చేస్తోంది.
కర్నాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగాహానాలను కొట్టిపారేశారు..