Home » DK Shivakumar
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అధిష్ఠానం సూచనలు మేరకు కర్ణాటకలో కులగణన తిరిగి చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా డీకే శివకుమార్ ప్రకటించారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ అంశానికి సంబంధించిన చరిత్ర తనకు తెలియనందున ఈ విషయంలో కామెంట్ చేయదలుచుకోలేదని చెప్పారు.
ఆ ఇద్దరి మధ్య వివాదం బాగానే ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా వారి మధ్య ఉన్న విభేదాలు ఓ విషయంతో మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. అయితే.. ఈ విభేదాలు ఎటు దారితీస్తాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.
గాలి జనార్దన్రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..
నేను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ భార్యను.. అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పవిత్ర అనే మహిళ డీకే సురేష్ భార్యగా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతోంది. అయితే.. దీనిపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటకలో కులగణన నివేదిక అమలుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమీక్షించారు. అమలులో హడావుడి నిర్ణయాలు ఉండబోతోన్నాయి, ఆ క్రమంలో 17వ తేదీకి ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న. గవర్నర్కు ఫిర్యాదు చేసి బెంగళూరు అభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కొత్త సారధి నియామకం త్వరలోనే జరగనుందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మార్పు అనివార్యమైతే ఆయన స్థానంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రెకు అవకాశం దక్కనుందని అభిప్రాయాలు జోరందుకున్నాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్లు చల్లింది. రామనగర జిల్లాను బెంగళూరు దక్షిణగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం షాక్ ఇచ్చింది.
లోక్సభ, అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన అంశంపై నిర్వహించే సమావేశానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు.