Home » CM Siddaramaiah
ఉగ్రవాద దాడి అమానవీయ చర్య అని,ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడానికి, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స చేశారు. దేవుడి పూజతో పాపాలు పోవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడనాట చర్చకు దారితీశాయి. తోటి మనిషిని ప్రేమించడమే మానవత్వం.. అంటూ ముఖ్యమంత్రి అన్నారు.
జేడీఎస్ యువనేత నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి హనీట్రాప్... ప్రజలకు పన్నుల ట్రాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘చాలప్ప చాలు.. కాంగ్రెస్ పాలన’ అంటూ.. నిఖిల్ వ్యాఖ్యానించారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కొత్త సారధి నియామకం త్వరలోనే జరగనుందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మార్పు అనివార్యమైతే ఆయన స్థానంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రెకు అవకాశం దక్కనుందని అభిప్రాయాలు జోరందుకున్నాయి.
సంచలనం కలిగించిన మైసూరు అర్బన్ డవలప్మెంట్(ముడా) స్కాంపై మైసూరు నగరాభివృద్ది ప్రాధికార మాజీ కమిషనర్ డీబి నటేష్ను విచారణ జరిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లు రద్దుపై హైకోర్టు ఫుల్బెంచ్ను ఆశ్రయించారు. ఈ స్కాంలో దాదాపు రూ. 4500 కోట్లు చేతులు మారాయనే విమర్శలు పెద్దఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.
లోక్సభ, అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన అంశంపై నిర్వహించే సమావేశానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు.
‘ప్రస్తుత ప్రభుత్వంలోనే కాదు... మరో ఐదేళ్లు నేనే సీఎం’ అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల అమలు కమిటీని రద్దు చేయాలని శాసనసభలో ప్రతిపక్షాలు బుధవారం ఆందోళన చేస్తున్న సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో గ్రూపు విభేదాలతో పాటు నాయకత్వ మార్పు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా(Congress President) కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే చర్చలు సాగుతున్న తరుణంలోనే రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి సతీశ్ జార్కిహొళి(Minister Satish Jarkiholi) రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు.
యూనివర్సిటీ(University)ల స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులో బుధవారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah)తోపాటు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Telangana CM Revanth Reddy) పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి కావడం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై ఏఐసీసీకి నివేదిక సమర్పించడంతో దడ పట్టుకుంది.