Home » CM Siddaramaiah
చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట, ఆర్సీబీకి సన్మాన కార్యక్రమాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని నిన్నటిదాకా చెబుతూ వచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మాటమార్చారు.
ఆ ఇద్దరి మధ్య వివాదం బాగానే ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా వారి మధ్య ఉన్న విభేదాలు ఓ విషయంతో మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. అయితే.. ఈ విభేదాలు ఎటు దారితీస్తాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.
కన్నడ చరిత్ర గురించి ఆయనకేం తెలుసట.. అంటూ తమిళ నటుడు కమల్హాసన్పై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళభాష నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కన్నడిగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
ఆ రెండు పథకాలను వారికి రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు బసవరాజరాయరెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల్లో కొందరు అనర్హులున్నట్లు గుర్తించామన్నారు.
కోవిడ్పై ఆందోళన వద్దే వద్దని, ఎవరూ భయపడాల్సిన అవపరం కూడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అయితే.. జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ముందు జాగ్రత్తగా మాస్క్లు ధరించాలని ఆయన కోరారు.
గాలి జనార్దన్రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన మిస్సైల్స్తో కాంగ్రెస్ వారికే అధిక బాధలున్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. అలాగే ఇంకా పలు విషయాలపై మాట్లాడారు.
ఉగ్రవాద దాడి అమానవీయ చర్య అని,ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడానికి, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స చేశారు. దేవుడి పూజతో పాపాలు పోవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడనాట చర్చకు దారితీశాయి. తోటి మనిషిని ప్రేమించడమే మానవత్వం.. అంటూ ముఖ్యమంత్రి అన్నారు.
జేడీఎస్ యువనేత నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి హనీట్రాప్... ప్రజలకు పన్నుల ట్రాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘చాలప్ప చాలు.. కాంగ్రెస్ పాలన’ అంటూ.. నిఖిల్ వ్యాఖ్యానించారు.