Home » AIADMK
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా ఆయనకు షాకిచ్చారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని ఈపీఎస్ చెబుతుండగా.. ‘అవునవును.. సంకీర్ణ ప్రభుత్వం కాదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ అన్నామలై వ్యాఖ్యానించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.
మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) సూచించారు.
తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.
టీవీకే అధ్యక్షుడు, హీరో విజయ్పై విమర్శలు చేయవద్దని పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సూచించారు. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిపై విమర్శలు గుప్పించాలని, డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి తథ్యం అని మాజీమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.
అగ్ర హీరో విజయ్ ఏర్పాటుచేసిన టీవీకే పార్టీ విజయావకాశాలపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడా పళనిస్వామి రహస్య సర్వే జరిపించారనే వార్తలు వస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవగా.. హీరో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ప్రభావం ఎంత అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్ రమేష్ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్లో వాచ్మన్ హత్య, మరోవాచ్మన్పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్రూమ్ ఇన్ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు.. ప్రధాని నరేంద్ర మోదీకి, యుద్ధానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వానికి రాష్ట్రప్రజానీకం తోడుగా వుండాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను కోరారు.
నీట్ వ్యవహారంపై విద్యార్ధులకు ముఖ్యమంత్రి స్టాలిన్ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా అధికార డీఎంకే పార్టీ 525 హామీలు ఇచ్చిందని, వాటిలో 15 శాతం కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.