Ganta Srinivasa Rao: దేశంలోనే రుషికొండ బీచ్ను నెంబర్ వన్గా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Mar 09 , 2025 | 11:29 AM
దేశంలోనేరిషికొండ బీచ్ను నెంబ్ వన్గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిషికొండకు, బీచ్కు పునర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.

విశాఖపట్నం: విశాఖపట్నంలోని రిషికొండ బీచ్ను మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆదివారం నాడు సందర్శించారు. రిషికొండ పరిసరాలను పరిశీలించారు. మళ్లీ బ్లూ ఫ్లాగ్ ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమస్వయంతోనే బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయామని గంటా శ్రీనివాసరావు అన్నారు.
దేశంలోనే రిషికొండ బీచ్ను నెంబర్వన్గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిషికొండకు, బీచ్కు పునర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. బ్లూ ఫ్లాగ్ హోదాను వెనక్కి తీసుకోవడాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని అన్నారు. ఆ హోదాను వెనక్కి తీసుకువచ్చేలా చర్యలు ప్రారంభిస్తామని గంట శ్రీనివాసరావు తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..