Share News

Bharat Bandh: మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్.. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో హై అలర్ట్

ABN , Publish Date - Jun 10 , 2025 | 07:10 AM

మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్‌కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Bharat Bandh: మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్.. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో హై అలర్ట్
Bharat Bandh

ములుగు: మావోయిస్ట్ పార్టీ (Maoist Party) భారత్ బంద్‌కు (Bharat Bandh) ఇవాళ(మంగళవారం) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు సహకరించవద్దని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.


వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆధ్వర్యంలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. మావోయిస్ట్‌లు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారంతో భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ జరుపుతున్నాయి. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కి నిరసనగా భారత్ బంద్‌కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. భారత్ విప్లవోద్యమ చరిత్రలో మే 21వ తేదీ చీకటి రోజుగా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి

కాచిగూడకు సరికొత్త వెలుగు

బస్‌పాస్‌ చార్జీల బాదుడు

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 10 , 2025 | 07:18 AM