Road Accident in Telangana: తెలంగాణలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు
ABN , Publish Date - May 20 , 2025 | 06:52 AM
Road Accident in Telangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వికారాబాద్ జిల్లా: రోడ్డు ప్రమాదాలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఏదోక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఆయా ఘటనల్లో కుటుంబ సభ్యులు మరణిస్తుండటంతో బాధిత కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ధాటికి బస్సులో ఉన్న వారిలో నలుగురు మృతిచెందగా.. 20మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామానికి చెందిన పలువురు పరిగిలో జరిగిన ఓ శుభకార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వారు స్వగ్రామానికి ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. హైవేపై వెళ్తున్న సమయంలో ట్రావెల్ బస్సు డ్రైవర్ ముందున్న లారీని ఓవర్టెక్ చేయబోయాడు. ఈక్రమంలో లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు పరిగి ఆస్పత్రికి తరలించే సమయంలో ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో 20మందికి పైగా తీవ్ర గాయాలవ్వగా.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన నలుగురి మృతదేహాలను అతి కష్టం మీద పోలీసులు బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు స్థంభించిపోయాయి. ట్రాఫిక్ జాం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Sama Ramamohan Reddy: రజతోత్సవ సభ కాదది.. విచ్ఛిన్న సభ!
Hyderabad fire tragedy: హైదరాబాద్ చరిత్రలోనే విషాదకర ఘటన
Farmer Suicide: పొలాల్లో ప్రాణాలొదిలిన నలుగురు రైతులు
Armoor crime: అనుమానంతో భార్యను చంపిన భర్త
Read Latest Telangana News And Telugu News