Home » Road Accident
Jammu and Kashmir: గాయపడ్డవారిలో 9 మంది స్పెషల్ క్విక్ యాక్షన్ టీమ్కు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వాహనం బోల్తా పడిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. గాయపడ్డ వారిని బయటకు తీసుకురావటానికి సాయం చేశారు
ఓ విశాలమైన రోడ్డులో ఓ బైకర్ తన దారిలో తాను వెళ్తుంటాడు. వైట్ బార్డర్ లైనుకు అవతల వైపు వెళ్తుంటాడు. ఇంతలో లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు .. బైకర్ను దాటి ముందుకు వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
Road Accident: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది అతివేగంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
దైవ దర్శనం చేసుకొని తిరిగొస్తుండగా కొడంగల్లో కారును బొలెరో ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్ను కారు ఢీకొని ఓ బాలుడు, మరో యువకుడు చనిపోయారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి వస్తున్న ఓ జీపు(తుఫాన్) ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident in Medak District: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగడంతో మగ్గురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి మెదక్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ఆల్టో కారును మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు, రాజేంద్ర నగర్కు చెందిన దీప్తి అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. రాపూరు తిక్కనవాటిక పార్క్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సురేశ్, అతని అత్త సరస్వతి అక్కడికక్కడే మరణించారు.
AP Road Accident: సత్యసాయి జిల్లాలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతిచెందగా పలువురు గాయాల బారిన పడ్డారు.
అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కలెక్టర్ రమాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.