Home » Telangana » Rangareddy
వికారాబాద్లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే చేవెళ్లలోని ఎంకేపల్లి వద్ద ఆధునిక గోశాలకూ ఆయన శంకుస్థాపన చేశారు. కుటుంబసమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు.
జవహర్ నగర్లో సంచలనం సృష్టించిన అంజు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో తల్లి హత్యకు చిన్న కుమార్తె, ఆమె ప్రియుడు కారణమని పోలీసులు వెల్లడించారు.
వికారాబాద్ ఆర్టీసీ డిపోలో సోమవారం అద్దె బస్సుల సర్వీసులు నిలిచాయి. డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా హైర్ బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే అద్దె బస్సులు బయటకు తీస్తామని తేల్చి చెప్పారు.
ఆస్తి కోసం కన్న తండ్రిని, తోబుట్టువులను చంపాలని చూడటం అత్యంత దారుణం. రైతులకు అండగా ఉండాల్సిన రైతుబీమా డబ్బులు ఒక కుటుంబంలో చిచ్చుపెట్టడం విషాదకరం. ఈ ఘటనపై పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వికారాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు.
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు. కాంగ్రెస్ ఐడియాలజీపై పాఠాలు చెప్పారు రాహుల్.