MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది సారూ..
ABN , Publish Date - May 27 , 2025 | 10:51 AM
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఎన్నికలప్పుడు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీని విస్మరించిందన్నారు.

హైదరాబాద్: ఆడపడుచుల వివాహానికి ఇస్తామన్న తులం బంగారం హామీ ఏమైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు కేసీఆర్(KCR) ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో మందికి ఆసరాగా నిలిచిందన్నారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహిళా వ్యతిరేకి రేవంత్ అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కార్పొరేటర్లు ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోతీనగర్ అభివృద్ధికి కృషి చేస్తా..
హైదరాడాద్: మోతీనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డా. ఎస్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో సోసైటీ సభ్యులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణారావును కలిశారు. మూసాపేట డివిజన్లోని మోతీనగర్ హౌజింగ్ సొసైటీలో ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేను తాము కలిసినట్టు వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మోతీనగర్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో మూసాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest Telangana News and National News