Minister Thummala: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం
ABN , Publish Date - May 17 , 2025 | 01:28 PM
Minister Thummala: దేశంలోనే ఏకైక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కొత్తగూడెం కేరాఫ్గా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం ప్రభుత్వ పక్షాన గట్టి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) ఉద్ఘాటించారు. సీతారామ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి పది నియోజకవర్గాల్లో సాగునీరు అందిస్తామని చెప్పారు. సాగర్ నీళ్లు అందించని పక్షంలో రాజీవ్ లింక్ కెనాల్ (Rajiv Link Canal) ద్వారా గోదావరి నీళ్లు అందజేస్తామని అన్నారు. ఇవాళ(శనివారం) కొత్తగూడెం, పాల్వంచలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.
కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద మూడు విద్యుత్ సబ్ స్టేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రఘురాం రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రైతులకు నష్టాలు లేని దీర్ఘకాలిక లాభాలు తెచ్చే ఆయిల్ పామ్ పంట (Oil palm crop) సాగుబాట పట్టాలని సూచించారు. జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతిబాట పట్టనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.
దేశంలోనే ఏకైక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కొత్తగూడెం కేరాఫ్గా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం ప్రభుత్వ పక్షాన గట్టి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామికంగా తెలంగాణకే మణిహారమని చెప్పారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఆయిల్ పామ్ హబ్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారిందని అన్నారు. టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం, ఇండస్ట్రీ టూరిజానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: సురేఖ తెగించి కమీషన్ మంత్రుల పేర్లు చెప్పాలి
High Court: 132 కిలోల మత్తుపదార్థాల పట్టివేత కేసులో బెయిల్ ఇవ్వలేం: హైకోర్టు
Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
Read Latest Telangana News And Telugu News