Home » Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల హాస్టల్లో భోజనం చేసిన తర్వాత సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 27న జరిగే కళ్యాణోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని భద్రాచలంలో రూ.1.52 కోట్ల భారీ ఎల్ఐసీ కుంభకోణం వెలుగుచూసింది. ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి కలిసి 39 మంది పాలసీదారులు మరణించినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, బీమా సొమ్మును కాజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అడవిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి గోదావరి మీదుగా పినపాక, కరకగూడెం మండలంలోకి మావోయిస్టులు వచ్చారనే సమాచాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోవడంతో అతడికి ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు.
టమాటా ధర తగ్గిపోయింది. దీంతో టమాటా సాగుచేసిన రైతు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతన్నాడు. గత పది. పదిహేనురోజుల క్రితం వరకు కిలో టమాటా రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉండగా ప్రస్తుతం పడిపోయింది.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీకి సిద్దమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు పొసగలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.