Home » Thummala Nageswara Rao
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జార్ఖండ్ వ్యవసాయ మంత్రి శిల్పి నేహ భేటీ అయ్యారు. రైతుల సంక్షేమ పథకాలపై చర్చించిన ఈ సమావేశంలో ఆయిల్పామ్, కృత్రిమ మేధస్సు వినియోగం, హార్టికల్చర్ రంగ అభివృద్ధి పై చర్యలు తీసుకోవడం అన్నింటిపై సమీక్షించారు
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం అనుసరించిన రాజకీయ సూత్రాలు, అప్పుడు ప్రభావశీలంగా ఉన్న విధానాలు ఇప్పుడు పనికిరావన్నారు.
పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై చేపట్టిన విజిలెన్స్ విచారణను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందుకోసం సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వానాకాలం, యాసంగి సీజన్లలో పంటల బీమాకు వర్తించగల పంటలపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు
రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి మరో రాష్ట్రం రాష్ట్రం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకే విడతలో రైతు రుణమాఫీ పూర్తి చేసిన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా రూ..33వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని చెప్పారు.
గత ప్రభుత్వంలో పేదల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు చేశారు. సన్న బియ్యం పథకాన్ని అమలు చేసి, పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు
రాష్ట్రవ్యాప్తంగా 15 బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ‘జీపీఎస్ రెనోవేబుల్ ఆర్య’ సంస్థ ముందుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని మాట్లాడుతున్న కొందరు.. ప్రజల సొమ్ముతో కేంద్రప్రభుత్వం నడుస్తున్నందున కేంద్ర పథకాల్లో సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు పెడతారా? అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రశ్నించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా ‘‘గ్రామగ్రామానికి జయశంకర్ వర్సిటీ నాణ్యమైన విత్తనం’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్లో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ద్వారా 12 వేల గ్రామాల్లో 40 వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు