Nims fire incident: నిమ్స్లో అగ్నిప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి...
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:58 PM
Nims fire incident: నిమ్స్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వారి విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్: నిమ్స్ అగ్నిప్రమాద ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిగరెట్, చెత్త వల్లనే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శనివారం నాడు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గంటలోనే అగ్నిప్రమాదాన్ని కంట్రోల్లోకి తీసుకువచ్చారు. పొగ కంట్రోల్కి వచ్చాక అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
లిఫ్ట్ పక్కన ఉన్న చెత్త, కాల్చి పడేసిన బీడీ, సిగరెట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేర్ లెస్ స్మోక్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మొదట సిగరెట్తో చెత్త అంటుకొని, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్లకు అంటుకుందని పోలీస్ అధికారులు నిర్దారించారు. సిబ్బంది ఖాళీగా ఉన్న ఐదో ఫ్లోర్లో చెత్త పడేశారని అన్నారు. అక్కడే కొందరు సిగరెట్ తాగి పడేయడంతో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు.
కాగా.. నిమ్స్ ఆరోగ్యశ్రీ సిబ్బంది అక్రమంగా బాణాసంచా నిల్వలు ఉంచారంటూ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana Police: సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త
Smita Sabharwal: ఆ రెండు వేల మందిపై చర్యలు తీసుకుంటారా
Owaisi on Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై పోరాటం
Read Latest Telangana News And Telugu News