Home » Fire Accident
అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది తీరంలోని బస్తీ ఘాట్ వద్ద శనివారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం సంభవించింది.
రాజధాని అమరావతిలోని ప్రాంతం రాయపూడిలో నిన్న(సోమవారం) రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(మంగళవారం) రివ్యూ నిర్వహించారు. రాయపూడిలో హెచ్వోడీ టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకి అధికారులు వివరించారు.
నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ అడవుల్లోని హరితవనంలో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి దస్తూరాబాద్, దేవునిగూడ సమీపంలోని హరితవనంలో చెట్లు దగ్ధం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఘటనలో మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది
గడ్డి తరలిస్తున్న మినీ లారీకి కరెంటు తీగలు తగిలి.. మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెదురుకుప్పం మండలం దామరకుప్పం రైస్మిల్ ఇండ్లు వద్ద చోటుచేసుకుంది.
చనిపోవడానికి ముందు ముగ్గురు వ్యక్తులు సాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ముగ్గురు వ్యక్తులు సాయం కోసం బాల్కనీలోకి వచ్చి నిల్చుని ఉన్నారు. చావు భయంతో గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవదహనం అయ్యారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పెను విషాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున బ్రిజేశ్వరి అనెక్స్ కాలనీలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ ఫలక్నుమా ఫరూఖ్నగర్లో బస్డిపో సమీపంలోని సోఫాల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి నుంచి మంటలు పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి.
ఒడిశా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కటక్ SCB ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.