Telangana Liquor Tragedy: కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:03 AM
Telangana Liquor Tragedy: తెలంగాణలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో బాధితులకు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వీరిలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

హైదరాబాద్, జులై 12: కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితులకు వైద్యం కొనసాగుతోంది. కల్తీ కల్లు బారిన పడిన వారిలో 33 మంది నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కిడ్నీ పనిచేయని బాధితుల సంఖ్య తొమ్మిది మందికి చేరింది. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంకో 12 మందిని అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
మరో 19 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక కల్తీ కల్లు ఘటనలో ప్రధాన నిందితుడు కూన సత్యం గౌడ్ను కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కుమారులు రవితేజ గౌడ్, సాయితేజ గౌడ్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కూన సత్యం గౌడ్ అరెస్ట్తో నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. అలాగే ఈ ఘటనలో బాల్నగర్ ఎక్సైజ్ సీఐపై వేణుకుమార్పై వేటు పడింది. కల్తీ దందాపై చర్యలు తీసుకోని కారణంగా ఎక్సైజ్ సీఐను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంతేకాకుండా మరికొంత మందిపై విచారణకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కల్తీ కల్లు ఘటనపై కూకట్పల్లి, కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు, బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో ఆరు కేసులు నమోదు అయ్యాయి.
ఇవి కూడా చదవండి..
మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్కు అర్థమేమి సాయిరెడ్డి
ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద జనం..
Read Latest Telangana News And Telugu News