Special buses: ఉజ్జయినీ మహాకాళి బోనాలకు 175 ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Jul 12 , 2025 | 07:56 AM
ఉజ్జయినీ మహాకాళి బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్కు 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ శుక్రవారం వెల్లడించారు. 13, 14తేదీల్లో జరిగే బోనాలకు నగరం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరిలివచ్చే అవకాశాలున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ సర్వీసులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందన్నారు.

హైదరాబాద్ సిటీ: ఉజ్జయినీ మహాకాళి బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్(Secunderabad)కు 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్(Greater RTC ED Rajasekhar) శుక్రవారం వెల్లడించారు. 13, 14తేదీల్లో జరిగే బోనాలకు నగరం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరిలివచ్చే అవకాశాలున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ సర్వీసులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందన్నారు.
ఎంజీబీఎస్, జేబీఎస్, కాచిగూడ రైల్వే స్టేషన్(Kacheguda Railway Station)తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర వివరాలు, సమాచారం కోసం రేతిఫైల్ బస్స్టేషన్ - 9959226154, కోఠి-9959226160 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
Read Latest Telangana News and National News