Home » TGSRTC
ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే.. మహిళలకిచ్చిన హామీ మేరకు మహాలక్ష్మిల ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతోంది. కాగా.. ఈ 24 నెలల కాలంలో 118.78 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేసినట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో.. కొత్తగా మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బుధవారం నుంచి ఆ బస్సులు రొడ్డెక్కనున్నాయి. ఇప్పటికే నగరంలో ఎలక్ట్రిక్ , డీలక్స్ బస్సులు సేవలందిస్తుండగా కొత్తగా మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రయాణికులకు సేవలందిచనునంనాయి.
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఒక పూర్తి స్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులకు యజమానులయ్యే అవకాశాన్ని ఇస్తోంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మొత్తం 600 బస్సులు అందించనుంది.
బెంగళూరు నుంచి ప్రతిరోజూ బోధన్కు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ప్రసాద్గౌడ్ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్, మెదక్, బాలానగర్ల మీదుగా హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్కు చేరుతుందన్నారు.
నగరంలో డీజిల్ బస్సులను తగ్గిస్తూ ఈవీ బస్సులను పెంచేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. రెండేళ్లలో మూడు వేల ఎలక్ర్టిక్ బస్సులు నడపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ జోన్లో ఇప్పటికే 265 ఈవీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా వాటి సంఖ్య పెంచుతోంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ హైదరాబాద్-1 డిపో(Hyderabad-1 Depot) నవంబరులో ప్రతీ శనివారం సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు డిపో మేనేజర్ ఎం.వేణుగోపాల్ తెలిపారు.
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు తమ స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలతో పాటు ప్రైవేట్ బస్సులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన విషయంలో అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎ్సలను నాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు.