Home » TGSRTC
TGRTC Tour Packages: తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకే వారికి ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ప్రత్యేక టూర్ ప్యాకేజీతో భక్తి, విహార యాత్రలకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఆర్టీసీ.
పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్లను నియమించేందుకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
ఆర్టీసీలోని వెల్ఫేర్ కమిటీలతో ఈ నెల 27న అధికారులు నిర్వహించబోతున్న సమావేశాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉద్యోగుల వేతనాల నుంచి వసూ లు చేసిన సొమ్ము రూ.1,029 కోట్లు ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఖాతాలో జమ చేయనందుకు ముగ్గురు ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నోటీసులు పంపింది.
సరస్వతి పుష్కరాలకు గ్రేటర్ హైదరాబాద్లోని నిర్ణిత ఏరియాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నగరంలోని గండిమైసమ్మ, అపురూపకాలనీ, జగద్గిరిగుట్ట ఏరియాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు.
ఆర్టీసీ కండక్టర్లకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వారికి రోజువారీ టార్గెట్లను విధిస్తున్నారు. దీంతో ఆ లక్ష్యాన్ని చేరుకోలేక కండక్టర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఓపక్క బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సిటీలో బస్ పాస్లుండటంతో లక్ష్య చేధన తలకు మించిన భారంగా మారింది.
TGSRTC Tampering Case: తెలంగాణ ఆర్టీసీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత అక్డోబర్లో సరైన పత్రాలు లేవని ఓ బోరుబండిని పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ బండిలోని ఇంజిన్, ఛాసిన్ నంబర్లను సదరు యాజమాని మార్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆర్టీసీ సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీసీ సిబ్బంది కాసుల కోసం కక్కుర్తి పడి ఈ వ్యవహారం నడిపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
సరస్వతీ నది పుష్కరాలకు హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. బుధవారం నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేగాక 40 మంది ప్రయాణికులుంటే ఆ కాలనీకే బస్సు పంపిస్తామన్నామని అధికారులు తెలిపారు.
TGSRTC Strike Postponed : ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది.
Minister Ponnam Prabhakar: ఆర్టీసీ సమ్మెతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రబాకర్ అన్నారు. కార్మికులు సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.